మాజీ మంత్రి కమతం రామిరెడ్డి మృతికి కేసీఆర్ సంతాపం
ABN , First Publish Date - 2020-12-05T20:40:17+05:30 IST
మాజీ మంత్రి కమతం కామిరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి కమతం కామిరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో మంచి నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని సీఎం అన్నారు. ఈసందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.