గంగా జమునా తెహజీబ్కు ప్రతీకగా బోనాలు: కేసీఆర్
ABN , First Publish Date - 2021-07-11T00:34:01+05:30 IST
బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్
హైదరాబాద్: బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్కు ప్రతీకగా బోనాలు నిలుస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు.