హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలిరోజే భారత్ పతకాన్నికైవసం చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయిచాను సిల్వర్ మెడల్ సాధించడం గొప్ప విషయమని అన్నారు. మీరాబాయికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇదేస్పూర్తిని మన క్రీడాకారులు కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించి పెట్టాలని సీఎం ఆకాంక్షించారు.