Goutama buddha గౌతమ బుద్ధుని బోధనలు అనుసరణీయం: Kcr
ABN , First Publish Date - 2022-05-17T00:11:40+05:30 IST
గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(kcr) బుద్ధుని బోధనలను స్మరించుకున్నారు
హైదరాబాద్: గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(kcr) బుద్ధుని బోధనలను స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని సీఎం అన్నారు. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా వుందన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బౌద్ధం పరిడవిల్లిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా నది ఒడ్డున ప్రకృతి రమణీయవతల నడుమ అన్ని హంగులతో నాగార్జున సాగర్ లో అంతర్జాతీయ స్ధాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధవనం బౌద్ధకేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి జాతికి అంకితం చేసిందని సీఎం అన్నారు.
బుద్ధుని జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కంద్రంగా భాసిల్లనున్నదన్నారు. సర్వజన సంక్షేమం,ప్రేమ, శాంతి, సహజీవనాలతో కూడిన ప్రగతి దిశగా గౌతమబుద్ధుని మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.