మా దీక్షకు పోటీగా హైదరాబాద్‌లో ధర్నా చేస్తారా? సిగ్గుండాలి

ABN , First Publish Date - 2022-04-11T20:07:42+05:30 IST

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి తాము ఢిల్లీలో ధర్నా చేస్తే దానికి పోటీగా హైదరాబాద్ లో బిజెపి నేతలు ధర్నా చేస్తారా? మీకు సిగ్గుండాలని సీఎం కేసీఆర్ బిజెపి నేతలను తీవ్రంగా దుయ్యబట్టారు.

మా దీక్షకు పోటీగా హైదరాబాద్‌లో ధర్నా చేస్తారా? సిగ్గుండాలి

న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి తాము ఢిల్లీలో ధర్నా చేస్తే దానికి పోటీగా హైదరాబాద్ లో బిజెపి నేతలు ధర్నా చేస్తారా? మీకు సిగ్గుండాలని సీఎం కేసీఆర్ బిజెపి నేతలను తీవ్రంగా దుయ్యబట్టారు. రైతుల ప్రయోజనాల కోసం తాము ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని, కానీ బిజెపి నాయకులు సమస్యను పక్కదోవ పట్టించడానికే పోటీగా మరో ధర్నా చేస్తున్నారని విమర్శించారు. రైతుల్ని కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఊరికేపోదని కేసీఆర్ అన్నారు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందని, కేంద్రాన్ని గద్దెదించే సత్తా రైతులకు ఉంది కేసీఆర్ స్పష్టం చేశారు.


తెలంగాణ ఓట్లు, సీట్లు కావాలి కానీ.. ధాన్యం వద్దా? అంటూకేసీఆర్ ప్రశ్నించారు. రైతుల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. కేంద్రం పంట మార్పిడి చేయమందని మేం రైతులకు చెప్పాం....రైతులు ధాన్యం పండించండి.. కొంటామని బీజేపీ చెప్పిందని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం రైతులను రెచ్చగొట్టారని అన్నారు. 

Updated Date - 2022-04-11T20:07:42+05:30 IST