క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పతకాలతోతిరిగి రావాలి:సీఎం

ABN , First Publish Date - 2021-07-23T22:46:40+05:30 IST

జపాన్‌ దేశంలోని టోక్యోలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు.

క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పతకాలతోతిరిగి రావాలి:సీఎం

హైదరాబాద్‌: జపాన్‌ దేశంలోని టోక్యోలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్‌ విశ్వాసానికి, శాంతి సౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడికి ప్రతి రూపంగా నిలుస్తాయని సీఎం అభివర్ణించారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో విజయాలు సాధించి, స్వర్ణాలతో పాటు పతకాలు గెలిచేలా క్రీడాకారులకు శుభం జరగాలని సీఎం కోరుకున్నారు. భారత దేశ కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై మరోసారి ఎగురవేయాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.


Updated Date - 2021-07-23T22:46:40+05:30 IST