రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2021-12-25T01:59:03+05:30 IST
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వాన్ని చాటిన ఏసు క్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. క్షమాగుణం, శాంతి, కరుణ,సహనం,ప్రేమతో జీవించిన క్రీస్తు జీవన గమనం నేటీకీ ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని సీఎం కేసీఆర్ అన్నారు.