KCR vs Central government: కేంద్రంపై కేసీఆర్ మరోసారి ఫైర్

ABN , First Publish Date - 2022-08-15T17:41:38+05:30 IST

కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

KCR vs Central government: కేంద్రంపై కేసీఆర్ మరోసారి ఫైర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం (Central government)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం (Independence day) సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం జాతీయ పతాకాన్ని(National flag) ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సీఎం... చివరలో కేంద్రం రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయంపై ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం మొండి చేయి చూపిస్తోందంటూ మండిపడ్డారు. రైతుల ఉద్యమంతో కేంద్రం రైతు నల్ల చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. టాక్సుల పేరిట జనాన్ని దోచుకుంటోందని విమర్శించారు. చిన్న పిల్లలు తాగే పాలు, స్మశాన వాటిక నిర్మాణంపై కేంద్రం ఎడాపెడా పన్నులు వేస్తోందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉచితాలపై కేంద్రం రాష్ట్రాలను అవమనిస్తోందన్నారు. కేంద్రం తీరు వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-08-15T17:41:38+05:30 IST