తెలంగాణలో 111 జీవో ఎత్తివేత
ABN , First Publish Date - 2022-04-12T23:58:54+05:30 IST
తెలంగాణ 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కేబినెట్ భేటీలో ..
హైదరాబాద్: తెలంగాణలో 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. కేబినెట్ భేటీలో మంత్రులతో చర్చించిన ఆయన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఆరు కొత్త ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల హామీల మేరకు 111 జీవోను ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో నదులు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కేసీఆర్ చెప్పారు.
‘‘మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తాం. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫార్మా యూనివర్సిటీని వెంటనే అందుబాటులోకి తేవాలి. శంషాబాద్ ఎయిర్పోర్టులో సెకండ్ రన్వే కోసం చర్యలు చేపడతాం. యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు చేస్తాం. అప్పట్లో భూగర్భజలాలే దిక్కయ్యాయి. సమైక్యపాలనలో వ్యవసాయం ధ్వంసమైంది.’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.