Bandi Sanjay: నేను చెప్పేది తప్పు అయితే దేనికైనా సిద్ధం

ABN , First Publish Date - 2022-08-11T02:11:01+05:30 IST

సీఎం కేసీఆర్ (Cm Kcr) మునుగోడు (Munugodu)లో ఇచ్చే డబ్బులు తీసుకుని.. ఓటు ఎక్కడ వేయాలో ...

Bandi Sanjay: నేను చెప్పేది తప్పు అయితే దేనికైనా సిద్ధం

యాదాద్రి (Yadadri): సీఎం కేసీఆర్ (Cm Kcr) మునుగోడు (Munugodu)లో ఇచ్చే డబ్బులు తీసుకుని.. ఓటు ఎక్కడ వేయాలో అక్కడే వేయండని ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పిలుపు నిచ్చారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతోంది.


ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ (Bjp) గెలిస్తే కేసీఆర్ అహంకారం పోతుందన్నారు. తెలంగాణ (Telangana)లో ప్రతి చోట ఉపఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అలా జరిగితే వాళ్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారని బండి సంజయ్ చెప్పారు.  కాంగ్రెస్ (Congress) పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండానే టీఆర్ఎస్ (Trs) ఎలా తీసుకుందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని.. తాను చెప్పేది తప్పు అయితే దేనికైనా సిద్ధమన్నారు. రైతులకు ఎరువుల సబ్సిడీ ఇస్తున్నది కేంద్రమేనని స్పష్టం చేశారు. పేదలకు రైతుబంధు ఇవ్వకుండా పెద్ద కాలేజీలు ఉన్న వాళ్లకు రైతుబంధు (Rythu Bandhu) ఇస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు

Updated Date - 2022-08-11T02:11:01+05:30 IST