వరి పంట వేయవద్దు: కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-11-08T23:22:13+05:30 IST

రాష్ట్రంలోని ఎవరూ కూడా దయచేసి వరి పంట వేయవద్దని రైతులకు

వరి పంట వేయవద్దు: కేసీఆర్‌

హైదరాబాద్: రాష్ట్రంలోని ఎవరూ కూడా దయచేసి వరి పంట వేయవద్దని రైతులకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  రైతులకు సీడ్‌ కంపెనీలతో టై అప్‌ ఉంటే వరి పంట వేయొచ్చన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం డోలాయమాన స్థితిని సృష్టిస్తోందని కేసీఆర్‌ ఆరోపించారు. కేంద్రాన్ని నమ్ముకునే పరిస్థితి లేదన్నారు. రైతులు వేరే పంటలను పండించుకోవాలని కేసీఆర్‌ సూచించారు. కేంద్రమే ధాన్యాన్ని కొనాలని కోరుతూ వచ్చే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఎలాగైనా అమ్ముడు పోతుందని వరి పంట వేయవద్దని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-08T23:22:13+05:30 IST