TS News: గోల్కొండ కోటకు బయలుదేరిన సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-08-15T15:29:34+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాసం నుంచి గోల్కొండ కోటకు (Golconda Fort) బయలుదేరారు.
హైదరాబాద్ (Hyderabad): ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తన నివాసం నుంచి గోల్కొండ కోటకు (Golconda Fort) బయలుదేరారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోటపై సీఎం జాతీయ జెండా (National Flag) ఆవిష్కరించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు గోల్కొండ కోటకు చేరుకోనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా దాదాపు వేయి మంది కళాకారులు స్వాగతం పలుకనున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీస్ దళాలు, రాష్ట్రీయ సెల్యూట్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేశారు. మొత్తం కార్యక్రమాన్ని వీక్షించడానికి వీలుగా సమాచార శాఖ అధికారులు ప్రత్యేక తెరలను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే వారికి మంచినీటి సౌకర్యం, వర్షం వచ్చినా ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు.