ఆపదలో ఉన్న వారికి సీఎం కేసీఆర్ అండ
ABN , First Publish Date - 2021-05-07T06:07:40+05:30 IST
ఆపదలో ఉన్న అన్నివర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు.
ఆదిలాబాద్టౌన్, మే 6: ఆపదలో ఉన్న అన్నివర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఇచ్చోడ మండలానికి చెందిన సిరిగిరి రాములకు రూ.22వేలు, బత్తుల సుజాతకు రూ.16వేలు, మంచమమతకు రూ.15,500, మాలత్బికు రూ.15వేల చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, దాసరి భాస్కర్ తదితరులున్నారు.