గోదావరి పరివాహక ప్రాంతాల్లో రేపు సీఎం KCR ఏరియల్ సర్వే
ABN , First Publish Date - 2022-07-16T15:50:29+05:30 IST
భారీ వర్షాల నేపథ్యంలో రేపు(ఆదివారం) ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో రేపు(ఆదివారం) ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో సీఎం ఏరియల్ సర్వే కొనసాగనుంది. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సర్వేల పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం చేపట్టే ఏరియల్ సర్వేకు సంబంధించిన హెలికాప్టర్ రూటు సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్ను ఫైనల్ చేయనుంది. మరోవైపు ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా, వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harish rao) సమీక్షాసమావేశాన్ని నిర్వహించనున్నారు.