TS News: ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు
ABN , First Publish Date - 2022-08-16T01:12:13+05:30 IST
Hyderabad: గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) రాజ్ భవన్లో నిర్వహించే ‘ఎట్ హోమ్’ (At home) కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆఆర్ హాజరవుతారని రాజ్ భవన్ వర్గాలకు
Hyderabad: గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) రాజ్ భవన్లో నిర్వహించే ‘ఎట్ హోమ్’ (At home) కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారని రాజ్ భవన్ వర్గాలకు సీఎంవో సమాచారం పంపింది. సీఎం వెళ్లకపోవడంతో టీఆర్ఎస్ నాయకులు, ప్రతినిథులు కూడా వెళ్లలేదు. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, హైదరాబాద్ సీపీ ఆనంద్, రాచాకొండ సీపీ మహేష్ భగవత్ మాత్రమే హాజరయ్యారు. గవర్నర్, కేసీఆర్ చివరగా హైకోర్టు చీఫ్ జడ్జి ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు. కరోనా కారణంగా తేనేటి విందుకు హాజరు కాలేకపోతున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) తెలిపారు. కాగా పాదయాత్ర కారణంగా రాలేకపోతున్నానని బండి సంజయ్ (Bandi Sanjay) పేర్కొన్నారు. కరోన కారణంగా రెండు సంవత్సరాలుగా రాజ్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించలేదు.