దళితబంధు పథకంపై ఈ నెల 26న తొలి అవగాహన సదస్సు
ABN , First Publish Date - 2021-07-23T03:52:25+05:30 IST
దళితబంధు పథకంపై ఈ నెల 26న తొలి అవగాహన సదస్సు
హైదరాబాద్: దళితబంధు పథకంపై ఈ నెల 26న తొలి అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి దళితబంధు అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. సదస్సుకు 427 మందిని సీఎం ఆహ్వానించనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి నలుగురికి ఆహ్వానం అందనుంది. ప్రతి గ్రామం నుంచి ఇద్దరు చొప్పున పురుషులు, మహిళలను ఆహ్వానించనున్నారు.