చౌదరి అజిత్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్

ABN , First Publish Date - 2021-05-06T16:16:21+05:30 IST

కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్‎దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలుగా కేంద్ర మంత్రిగా

చౌదరి అజిత్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్

హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్‎దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలుగా కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను అజిత్ సింగ్ చేపట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలికిన వారి జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని కేసీఆర్ అన్నారు. దివంగత చౌదరి అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - 2021-05-06T16:16:21+05:30 IST