ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-01-01T19:03:11+05:30 IST

ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేస్తా ఉంటే మంచిని విమర్శించేవారు ఉన్నారని మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే అడ్డుకున్నారని చెప్పారు.

ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఆగ్రహం

గుంటూరు: ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేస్తా ఉంటే మంచిని విమర్శించేవారు ఉన్నారని మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే అడ్డుకున్నారని చెప్పారు. పేదల కోసం సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తే దీనిపై కూడా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలకు మంచి జరగకూడదని దురుద్దేశంతోనే అడ్డుకుంటున్నారని అన్నారు. వీరంతా పేదలకు శత్రువులు కాదా? అని సీఎం ప్రశ్నించారు. రాజకీయ స్వార్థంతో ప్రతిదానికి అడ్డుపడుతున్నారుని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచైనా వీరికి మంచి జ్ఞానం కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు. 

Updated Date - 2022-01-01T19:03:11+05:30 IST