అచ్చెన్నాయుడుని జగన్ రెడ్డి వేధించారు: లోకేష్
ABN , First Publish Date - 2020-08-14T02:22:14+05:30 IST
అచ్చెన్నాయుడుని జగన్ రెడ్డి వేధించారు: లోకేష్
గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ అయ్యింది అని తెలిసి కూడా కక్షసాధింపు కోసం, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని జగన్ రెడ్డి వేధించారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన కరోనా బారిన పడ్డారని, అచ్చెన్న త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని లోకేష్ అన్నారు.