మాటతప్పి ప్రజల్ని వంచించిన సీఎం జగన్
ABN , First Publish Date - 2020-08-07T11:27:26+05:30 IST
న్నికలకు ముందు అమరావతే రాజధాని అని, అందుకు తాము అన్ని విధాలా మద్దతిస్తామని అసెంబ్లీలోనే చెప్పి ..
కనిగిరి, ఆగస్టు 6 : ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని, అందుకు తాము అన్ని విధాలా మద్దతిస్తామని అసెంబ్లీలోనే చెప్పి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాట తప్పి ప్రజలను వంచించారని టీడీపీ నాయకులు నారపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, కో ఆప్షన్ బుజ్జి విమర్శించారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మూడు రాజధానుల అంశం ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ అంశం ఎన్నికల ముందు దాచిపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచాక నమ్మకద్రోహం చేసి రాజధాని రైతులకు వెన్నుపోటు పొడిచారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పదవులను కూడా త్యాగం చేస్తామని సవాలు విసిరినా సమాధానం చెప్పే ధైర్యం సీఎంకు లేదని దెప్పిపొడిచారు. సమావేశంలో నాయకులు తమ్మినేని వెంకటరెడ్డి, షేక్ జంషీర్, బ్రహ్మంగౌడ్, సురేష్, జనార్దన్ పాల్గొన్నారు.