Visakha: వాహనమిత్ర లబ్ధిదారులకు నిధులు విడుదల చేసిన CM Jagan

ABN , First Publish Date - 2022-07-15T18:06:19+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ (CM Jagan) రెడ్డి శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు.

Visakha: వాహనమిత్ర లబ్ధిదారులకు నిధులు విడుదల చేసిన CM Jagan

విశాఖ (Visakha): ముఖ్యమంత్రి జగన్మోహన్ (CM Jagan) రెడ్డి శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వాహన మిత్ర పథకం లబ్దిదారులకు  నాలుగో విడత నిధులు విడుదల చేశారు. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సాయం అందించారు. మొత్తం 2.60 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందుతోంది. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.261 కోట్ల నిధులు ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వాహన డ్రైవర్‌లను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించించారు.


ఈ రోజు చాలా సంతోషంగా ఉంది: సీఎం జగన్

ఈ రోజు చాలా సంతోషంగా ఉందని, వరుసగా నాలుగో సారి వాహన మిత్ర ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఆటో, టాక్సి డ్రైవర్లు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతున్నారని, మూడేళ్లలో.. రూ. 1000 కోట్లకుపైగా ఇచ్చామన్నారు. ఒక్కొక్క డ్రైవర్.. ఈ రోజుతో కలిపి రూ. 40 వేలు ఆర్ధిక సహాయం పొందారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన హామీని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాహన మిత్ర రూపంలో ఇస్తున్నామన్నారు. ‘ఇది మీ ప్రభుత్వం.. వైసీపీ పేదల ప్రభుత్వం.. జగనన్న ప్రభుత్వం’ అని అన్నారు. డ్రైవర్ల నుంచి గత 5 ఏళ్ల టీడీపీ హయాంలో.. రూ. 50 కోట్లు చలానా రూపంలో గుంజుకున్నారని విమర్శించారు. 


రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 61 వేల 516 మంది ఆటో, మ్యాక్సీ కాబ్ డ్రైవర్లకు సీఎం జగన్ రూ. 261 కోట్ల నిధులు విడుదల చేశారు. విశాఖ జిల్లాలో 20,711 మంది డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేస్తున్నారు. కాగా అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు ముఖ్యమంత్రి తొలిసారిగా శుక్రవారం విశాఖ నగరంలో ఒక బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్మోహన్‌రెడ్డి పలుమార్లు విశాఖ నగరానికి వచ్చినా బహిరంగ సమావేశంలో ఇప్పటివరకూ పాల్గొనలేదు. నేవీ మిలాన్‌కు హాజరైనప్పటికీ కేవలం నౌకాదళం పనితీరు, సేవలు గురించి మాత్రమే మాట్లాడారు. ఈరోజు మాత్రం వాహన డ్రైవర్‌లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

Updated Date - 2022-07-15T18:06:19+05:30 IST