Visakha: మరోసారి అక్కసును వెళ్లగక్కిన CM Jagan

ABN , First Publish Date - 2022-07-15T18:53:31+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ (CM Jagan) రెడ్డి శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు.

Visakha: మరోసారి అక్కసును వెళ్లగక్కిన CM Jagan

విశాఖ (Visakha): ముఖ్యమంత్రి జగన్మోహన్ (CM Jagan) రెడ్డి శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వాహన మిత్ర పథకం లబ్దిదారులకు  నాలుగో విడత నిధులు విడుదల చేశారు. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సాయం అందించారు. మొత్తం 2.60 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందుతోంది. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.261 కోట్ల నిధులు ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు (Chandrababu), ఈనాడు (Eenadu), ఆంధ్రజ్యోతి (AndhraJyothy), టీవీ 5 (TV 5)... దుష్ట చతుష్టయం పచ్చ టీవీలు, పచ్చపత్రికలు, దత్తపుత్రుడి అబద్దాలు, వక్రీకరణ చేస్తున్నాయని మండిపడ్డారు. తనకు నిబద్ధత, నిజాయితి, దేవుడు దయ ఉందని, ప్రజల దీవెన ఉందని అన్నారు. దోచుకో..పంచుకో..గత ప్రభుత్వ విధానమని అన్నారు. అప్పటి ప్రభుత్వం కన్నా తక్కువ అప్పులు చేశామని, ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-15T18:53:31+05:30 IST