ట్రాఫిక్ ఆంక్షలపై ఇబ్బంది పడ్డ విశాఖ వాసులు... జగన్ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-02-10T14:49:49+05:30 IST
విశాఖలో నిన్న సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు విదించారు.
అమరావతి: విశాఖలో నిన్న సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలపై విశాఖ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా... ట్రాఫిక్ను గంటల తరబడి నిలిపి వేయడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ సంఘటనపై విచారణ చేసి భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.