వరద పరిస్థితిపై టీటీడీ ఈవోకు సీఎం Jagan ఫోన్
ABN , First Publish Date - 2021-11-19T19:20:30+05:30 IST
తిరుమలలో వరద పరిస్థితిపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి సీఎం జగన మోహన్ రెడ్డి ఫోన్ చేశారు.
తిరుమల: తిరుమలలో వరద పరిస్థితిపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి సీఎం జగన మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిని సీఎంకు ఈవో తెలియజేశారు. వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిస్థితులను బట్టి భక్తులను తిరుమలకు అనుమతించాలని ఈవోకు సీఎం జగన్ తెలిపారు. సీఎం ఆదేశాలతో ఈవో జవహర్ రెడ్డి ఘాట్ రోడ్లను పరిశీలిస్తున్నారు.