చొక్కా వేసుకున్నా పన్ను వేస్తారు.. చంద్రబాబు ఎద్దేవా

ABN , First Publish Date - 2020-02-19T19:48:09+05:30 IST

జగన్ సర్కార్ రద్దుల ప్రభుత్వమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రకాశం జిల్లాలో

చొక్కా వేసుకున్నా పన్ను వేస్తారు.. చంద్రబాబు ఎద్దేవా

ప్రకాశం: జగన్ సర్కార్ రద్దుల ప్రభుత్వమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రకాశం జిల్లాలో ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన ఆయన.. ఇది రద్దుల ప్రభుత్వమని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లన్నీ రద్దు చేశారన్నారు. ఎక్కడైనా ఒక గంప మట్టి వేశారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చామని.. వైసీపీ దొంగలు ఇనుకను అమ్ముకుంటున్నారన్నారు. దొంగ చేతికి తాళాలు ఇస్తే.. మొత్తం దోచుకుపోయారన్నారు. ఇసుక, సిమెంట్‌, మద్యం ధరలు పెంచేశారని ఆరోపించారు. జే ట్యాక్స్‌ కట్టిన బ్రాండ్‌ల మద్యానికే అనుమతి అన్నారు. కరెంట్‌ ఉండదు.. రాని కరెంట్‌కు ధరలు పెంచేశారన్నారు. పీపీఏలను రద్దు చేశారని, సోలార్‌ విండ్‌ని సంక్షోభంలోకి నెట్టారన్నారు. బస్‌ ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచారన్నారు. చివరికి ప్రజలు చొక్కా వేసుకున్నా.. పన్ను వేసేలా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.


Updated Date - 2020-02-19T19:48:09+05:30 IST