పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2021-07-30T23:15:44+05:30 IST
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ 'క్లాప్' కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలందించారు. 124 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో 1.2 కోట్ల బిన్లు, 40 లక్షల ఇళ్లకు ఇంటికి మూడు చొప్పున బిన్లు, సేకరించిన వ్యర్థాలను వివిధ విధానాల్లో ట్రీట్ చేసేలా ఏర్పాట్లు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. 72 పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు, ఆగస్ట్ 15లోపు టెండర్ల ప్రక్రియ, జూలై 2022లోపు ఏర్పాటుకు కార్యాచరణ ఉంటుందని జగన్ తెలిపారు.