కోవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2022-01-17T18:09:47+05:30 IST

తాడేపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

కోవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై  సీఎం జగన్ సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, సీఎస్, డీజీపీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే మంగళవారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలుపై పలు సూచనలు చేయనున్నారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై సమీక్షిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నేపధ్యంలో తీసుకోవాల్సిన జగర్తలపై సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు.

Updated Date - 2022-01-17T18:09:47+05:30 IST