నేడు ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-07-14T15:06:14+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు.
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రితో పాటు శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు కోవిడ్ నియంత్రణపై డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు సమావేశాల్లో పలు విషయాలపై నిశితంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.