విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2022-01-05T21:48:28+05:30 IST
విద్యాశాఖపై అధికారులతో సీఎం
అమరావతి: విద్యాశాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ చేయాలన్నారు. సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలన్నారు. నాడు-నేడు తర్వాత పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.