కాంట్రాక్ట్ లెక్చరర్ల అభ్యర్థనలపై స్పందించిన సీఎం జగన్
ABN , First Publish Date - 2020-09-28T02:18:23+05:30 IST
కాంట్రాక్ట్ లెక్చరర్ల అభ్యర్థనలపై సీఎం జగన్ స్పందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 12 నెలల జీతం చెల్లించాలని ఆదేశించారు. ఇప్పటివరకు...
అమరావతి: కాంట్రాక్ట్ లెక్చరర్ల అభ్యర్థనలపై సీఎం జగన్ స్పందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 12 నెలల జీతం చెల్లించాలని ఆదేశించారు. ఇప్పటివరకు కాంట్రాక్ట్ టీచర్లు ఏడాదికి 10 నెలల జీతం మాత్రమే అందుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కాలేజీల్లో 5,042 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. ఇక నుంచి వీరందరికి సంవత్సరం జీతం చెల్లించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.