పథకాలపై అవగాహనలేని సీఎం జగన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-17T06:25:36+05:30 IST

పథకాలపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి అవగాహన లేదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

పథకాలపై అవగాహనలేని సీఎం జగన్‌రెడ్డి
మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్న

 తప్పుడు హామీలతో ప్రజలకు మోసం 

 మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, ఆగస్ట్టు 16: పథకాలపై ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి అవగాహన లేదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మంగళవారం నర్సీపట్నంలో వీడియో సందేశం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వెయ్యి మందికి ఒక ఫ్యామిలీ డాక్టరును నియమించడం మంచిదైనప్పటికీ ఈ పథకం అమలుపై జగనోమ్మోహన్‌రెడ్డికి అవగాహన లేక ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభు త్వం, మేధావులతో చర్చించి ఈ పథకం ప్రారంభిస్తే ప్రజలకు ఎంతో మేలు చేసినట్టు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అమరావతిలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకోవడమే తప్ప ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరంపై నోరు మెదపని ముఖ్యమంత్రి ఏం చెబుతున్నారో ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు. 

Updated Date - 2022-08-17T06:25:36+05:30 IST