తిరుమలకు చేరుకున్న సీఎం జగన్

ABN , First Publish Date - 2020-09-23T22:28:54+05:30 IST

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద సీఎంకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమలకు చేరుకున్న సీఎం జగన్

తిరుమల: తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద సీఎంకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో పద్మావతి అతిథి గృహం వద్ద నుంచి సీఎం జగన్ అన్నమయ్య భవన్‌కు చేరుకోనున్నారు. కోవిడ్‌పై ప్రధాని మోదీతో జరిగే సమీక్షా సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్, హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొననున్నారు. సాయంత్రం 6.15 నిమిషాలకు  ఆంజినేయ స్వామి దేవాలయం వద్దకు సీఎం చేరుకోనున్నారు. అక్కడ నుంచి ఊరేగింపుగా 6.30 నిమిషాలకు శ్రీవారి ఆలయానికి చేరుకొని స్వామి వారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకొని వాహన మండపానికి చేరుకొని గరుడవాహన సేవలో సీఎం జగన్ పాల్గొననున్నారు. 

Updated Date - 2020-09-23T22:28:54+05:30 IST