ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న Jagan
ABN , First Publish Date - 2022-07-05T16:33:20+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagana mohan reddy) కొద్దిసేపటి క్రితమే ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు.
కర్నూలు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagana mohan reddy) కొద్దిసేపటి క్రితమే ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఓర్వకల్లుకు చేరుకున్న జగన్కు వైసీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు కాటసాని, ఆర్థర్, శిల్పా చక్రపాణి రెడ్డి... సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఓర్వకల్లు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం జగన్ ఆదోనికి బయల్దేరి వెళ్లారు. ఆదోనిలో ‘‘జగనన్న విద్యా కానుక’’ను జగన్ పంపిణీ చేయనున్నారు.