సీఎం జగన్కు ప్రధాని మోదీ ఫోన్..
ABN , First Publish Date - 2020-04-06T01:53:08+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఏపీలో పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల గురించి సీఎం జగన్ను మోదీ అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రణ చర్యలపై జగన్మోహన్ రెడ్డితో మోదీ ఫోన్లో చర్చించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను మోదీకి సీఎం జగన్ వివరించారు. అప్రమత్తంగా ఉండాలని జగన్కు ప్రధాని సూచించారు.