రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-10-15T00:43:47+05:30 IST

థర్మల్‌ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులతో సీఎం భేటీ అయ్యారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: థర్మల్‌ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులతో సీఎం భేటీ అయ్యారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశించారు. బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలని సీఎం సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలలన్నారు. కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2021-10-15T00:43:47+05:30 IST