CM Jagan: వైఎస్సార్ జిల్లాలో మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన
ABN , First Publish Date - 2022-09-01T21:02:22+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపటి క్రితమే తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి (AP CM) చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా జిల్లాలో పూర్తి అయిన పలు అభివృద్ధి పనులను జగన్ (Jagan) ప్రారంభించనున్నారు. రేపు ఇడుపులపాయలో వైఎస్సార్ వర్ధంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం (YS Jagan reddy) పాల్గొననున్నారు. తిరిగి సెప్టెంబర్ 3న విజయవాడకు ముఖ్యమంత్రి జగన్ (YSRCP Chief) చేరుకోనున్నారు.