Jagan mohan reddy: ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు ఆపాలి: జగన్
ABN , First Publish Date - 2022-07-26T20:29:55+05:30 IST
ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు ఆపాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) అన్నారు.
కోనసీమ: ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు ఆపాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) అన్నారు. మంగళవారం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్.. గంటిపెదపూడిలో వరద బాధితులతో మాట్లాడారు. మీ కలెక్టర్ పనితీరు ఎలా ఉందంటూ బాధితులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ... పశువులకు నోరు ఉంటే అవి కూడా మెచ్చుకునేలా సాయం చేశామన్నారు. వరదల సమయంలో తాను వస్తే అధికారులు తన చుట్టే ఉంటారని... ప్రజలకు అన్నీ అందాకే వస్తానని అధికారులకు చెప్పానని తెలిపారు. ఇబ్బంది పెట్టకూడదనే వారం తర్వాత వచ్చా అని చెప్పుకొచ్చారు. ఏ ఒక్కరికీ సాయం అందలేదనే మాట వినిపించలేదన్నారు. ఈ ఏడాదిలోనే పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. జీపీ లంక వంతెన నిర్మిస్తామని సీఎం జగన్ తెలిపారు.