ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ-ఫారం అందజేసిన సీఎం జగన్

ABN , First Publish Date - 2021-11-16T17:29:39+05:30 IST

ఎమ్మెల్సీ అభ్యర్ధులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్‌ బాషాకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి బీ–ఫారం అందజేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ-ఫారం అందజేసిన సీఎం జగన్

అమరావతి: ఎమ్మెల్సీ అభ్యర్ధులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్‌ బాషాకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి  బీ–ఫారం అందజేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీల స్ధానాలకు తమ పేరును ఖరారు చేయడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్ధులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్‌ బాషా... ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-16T17:29:39+05:30 IST