నేడు స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
ABN , First Publish Date - 2021-10-05T13:52:00+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో స్వేచ్చ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో స్వేచ్చ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న కిషోర బాలికలకు సానిటరి నాప్కిన్స్ను ప్రభుత్వం ఉచితంగా అందచేయనుంది. నెలకు 10 నాప్కిన్లు ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయించింది. 7 తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థినిలకు ఈ కార్యక్రమం అమలుకానుంది. మెన్సురేషన్ సమయంలో బాలికల హాజరుతగ్గకుండా తీసుకునే చర్యలలో భాగంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, యూనిసెఫ్, వాష్, పి అండ్ జి, సంయుక్త సహకారంతో స్వేచ్ఛలో భాగంగా ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వ విద్యాసంస్థలలో స్వేచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.