Nara Lokesh: జగన్‎కు సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని బయట పెట్టబోతున్నా

ABN , First Publish Date - 2022-08-17T00:37:38+05:30 IST

సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణాన్ని వచ్చేవారం బయటపెట్టబోతున్నానని...

Nara Lokesh: జగన్‎కు సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని బయట పెట్టబోతున్నా

మంగళగిరి: సీఎం జగన్మోహన్ రెడ్డికి (Cm Jagan Mohan Reddy) సంబంధించిన ఓ పెద్ద కుంభకోణాన్ని (Scam) వచ్చేవారం బయటపెట్టబోతున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara lokesh) అన్నారు. తన సొంత ఖర్చులతో మంగళగిరిలో ఆరోగ్య సంజీవని (Arogya Sanjeevani) కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.  10వ తరగతి పాస్, డిగ్రీ ఫెయిల్ అయిన తెలివితేటలు జగన్మోహన్ రెడ్డివి అని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి టైమప్ అయిపోయి ఇంటికెళ్లే పరిస్థితి వచ్చేసిందన్నారు.  


‘‘జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే తరలిపోయినవే ఎక్కువ. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతా అనే చర్చే జరుగుతోంది. గత 3 ఏళ్లలో రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధo. జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతీ పరిశ్రమా తెలుగుదేశం ప్రభుత్వ కృషే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఉద్యోగుల కల్పన జరిగిందని జగన్ ప్రభుత్వమే ఒప్పుకుంది.  దాదాపు 500 హామీల్లో మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాలు గెలిపించాలా?. ఈడీ, ఐటీ, సీబీఐ భయంతో ఢిల్లీలో మెడలు వంచుతున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం సాధించారు.’’ అని నారా లోకేశ్ ప్రశ్నించారు. 



Updated Date - 2022-08-17T00:37:38+05:30 IST