కేంద్ర హోంమంత్రి Amit Shahతో సీఎం Jagan భేటీ
ABN , First Publish Date - 2022-06-03T15:36:18+05:30 IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ/అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. రెవిన్యూలోటు భర్తీ, పోలవరంప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసీకి గనులు కేటాయింపు, మెడికల్ కాలేజీలు తదితర అంశాలపై అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.