టీడీపీ నేతలకు ఏదో రోజు గుండెపోటు వస్తుంది: జగన్‌

ABN , First Publish Date - 2022-04-08T20:56:10+05:30 IST

టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన అప్పులను కూడా తాము తీరుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

టీడీపీ నేతలకు ఏదో రోజు గుండెపోటు వస్తుంది: జగన్‌

అమరావతి: టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన అప్పులను కూడా తాము తీరుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలకు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు.కావాలనే టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. టీడీపీ కడుపుమంటకు, అసూయకు మందే లేదని ఎద్దేవా చేశారు. కడుపుమంట, అసూయ పెరిగితే ఏదో రోజు గుండెపోటు వస్తుందన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద.. ఇప్పటివరకు 10 వేల 30 కోట్లు ఖర్చు చేశామని జగన్‌ చెప్పారు. 


అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ సీఎం జగన్‌

నంద్యాల: ప్రతిపక్షాలు, మీడియాపై సీఎం జగన్‌ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా వెంట్రుక కూడా పీకలేరంటూ విమర్శించారు.కడుపు మంట, అసూయతో బీపీ పెరిగి గుండెపోటుతో పోతారని చెప్పారు. ఏపీలో ప్రభుత్వంపై చెడుగా ప్రచారం చేయడమే కాకుండా.. పక్క రాష్ట్రాల్లో కూడా చెడుగా ప్రచారం చేస్తున్నారురని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో కూడా చెడుగా ప్రచారం చేస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. 


Updated Date - 2022-04-08T20:56:10+05:30 IST