జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2021-03-04T08:44:57+05:30 IST

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోసం రెండు రోజులు ప్రయత్నించినా దొరకపోవడమే దీనికి

జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

దొరకని మోదీ, షా అపాయింట్‌మెంట్‌

5 రాష్ట్రాల ఎన్నికలతో టైం ఇవ్వని నేతలు


న్యూఢిల్లీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోసం రెండు రోజులు ప్రయత్నించినా దొరకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అపాయింట్‌మెంట్‌ను బట్టి బుధవారం లేక గురువారం అమిత్‌షాతో భేటీ కావాలని జగన్‌ భావించారు. వీలుచిక్కితే ప్రధాని మోదీని కూడా కలిసి రావాలని ఆలోచించినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం ఐదు రాష్ర్టాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై, మోదీ, అమిత్‌షాలు ఆ హడావుడిలో ఉన్నారు. ఆ తేదీల్లో సమయం కేటాయించలేమని హోం, పీఎం కార్యాలయాల అధికారులు.. ఏపీ భవన్‌ అధికారులకు బుధవారం సాయంత్రం స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, వచ్చే వారం లోపు వారిద్దరి అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని ఏపీ భవన్‌ అధికారులు కోరినట్లు చెబుతున్నారు. 

Updated Date - 2021-03-04T08:44:57+05:30 IST