పెద్దలు రోశయ్య మరణ వార్త ఎంతో బాధించింది: Jagan
ABN , First Publish Date - 2021-12-04T17:08:10+05:30 IST
పెద్దలు రోశయ్య మరణ వార్త తననెంతో బాధించిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
అమరావతి: పెద్దలు రోశయ్య మరణ వార్త తననెంతో బాధించిందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి సీఎం జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.