అమరావతి: జగనన్న చేదోడు పథకం నిధుల విడుదల
ABN , First Publish Date - 2022-02-08T18:52:37+05:30 IST
జగనన్న చేదోడు పథకం రెండో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు.
అమరావతి: జగనన్న చేదోడు పథకం రెండో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో ఏడాది రజక, నాయిబ్రాహ్మణ, దర్జీలకు రూ.10 వేల సాయం చేస్తున్నామన్నారు. ఆ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,85,350 మంది ఖాతాల్లోకి రూ.285.35 కోట్లు జమ చేసినట్లు సీఎం తెలిపారు. బీసీలంటే పనిముట్లు, బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని, సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని పేర్కొన్నారు. నిజమైన చేదోడు అందిస్తోంది తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.