మా ప్రభుత్వం అన్నిటికీ సిద్ధం: సీఎం జగన్

ABN , First Publish Date - 2021-02-23T21:04:32+05:30 IST

తమ ప్రభుత్వం అన్ని ఎన్నికలకు సిద్ధంగా ఉందని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్ భేటీ నిర్వహించారు.

మా ప్రభుత్వం అన్నిటికీ సిద్ధం: సీఎం జగన్

తాడేపల్లి: తమ ప్రభుత్వం అన్ని ఎన్నికలకు సిద్ధంగా ఉందని సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్ భేటీ నిర్వహించారు. ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ తర్వాత పలువురు మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం జగన్ చర్చించారు. అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. కుప్పం కోటను బద్దలు కొట్టారంటూ మంత్రి పెద్దిరెడ్డిని ఈ భేటీలో జగన్ ప్రశంసించినట్లు తెలిసింది. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరుదామని జగన్ అన్నట్లు సమాచారం. వ్యాక్సిన్ త్వరగా ఇవ్వకపోతే మళ్లీ కేసులు పెరిగే అవకాశముందని సీఎం భావిస్తున్నాట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో చరిత్రలో లేనివిధంగా 80 శాతం ఫలితాలు సాధించామని మంత్రుల వద్ద సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-02-23T21:04:32+05:30 IST