సీఎం, చిరంజీవి భేటీ తర్వాతైనా పరిశ్రమపై దాడి ఆగిపోవాలి: రఘురామ

ABN , First Publish Date - 2022-01-13T20:33:27+05:30 IST

సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ తర్వాతైనా పరిశ్రమపై దాడి ఆగిపోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు.

సీఎం, చిరంజీవి భేటీ తర్వాతైనా పరిశ్రమపై దాడి ఆగిపోవాలి: రఘురామ

ఢిల్లీ: సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ తర్వాతైనా పరిశ్రమపై దాడి ఆగిపోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరి స్వార్థ రాజకీయాల వల్లే సంక్రాంతి జరుపుకోలేకపోతున్నానని తెలిపారు. హెచ్‌ఆర్‌ఏ తగ్గించి ఉద్యోగులకు జగనన్న శఠగోపం పెట్టారని దుయ్యబట్టారు. ఓటర్ల లాగానే ఉద్యోగసంఘాలు ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై పోరులో ప్రజలకు ఉద్యోగులు స్ఫూర్తిగా నిలవాలన్నారు. సీఐడీ ఆరోపణలపై ఆధారాలున్నాయా? అని రఘురామ ప్రశ్నించారు. కేంద్రం నిధులను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మే 14 లోపు ఏపీలో రాక్షసపాలన అంతానికి అంకురార్పణ జరుగుతుందని రఘురామకృష్ణరాజు తెలిపారు.

Updated Date - 2022-01-13T20:33:27+05:30 IST