రంగులకు లోట్సపాండ్ చెల్లించాలి: బుద్దా
ABN , First Publish Date - 2020-07-01T08:33:35+05:30 IST
‘‘ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ రంగులను చెరపడానికి కేంద్రం విడుదల చేసిన రూ.1300 కోట్లను మింగేయడం సబబు కాదు. ఆ ఖర్చును లోట్సపాండ్ ఖజానా...
విజయవాడ, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ భవనాలకు వేసిన వైసీపీ రంగులను చెరపడానికి కేంద్రం విడుదల చేసిన రూ.1300 కోట్లను మింగేయడం సబబు కాదు. ఆ ఖర్చును లోట్సపాండ్ ఖజానా నుంచి చెల్లించాలి’’ అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సీఎం జగన్మోహన్రెడ్డిని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ట్విటర్లో స్పందించారు. ‘‘14వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా టీడీపీ అడ్డుపడుతోందని యాగీ చేశారు. ఇప్పుడేమో వచ్చిన ఆ నిధులను వృథాగా రంగుల కోసం వాడుకుంటారా?’’ అని బుద్దా ప్రశ్నించారు.