సీఎం జగన్‌తో ముగిసిన అసంతృప్తి ఎమ్మెల్యేల భేటీ

ABN , First Publish Date - 2022-04-12T23:03:59+05:30 IST

సీఎం జగన్‌తో ముగిసిన అసంతృప్తి ఎమ్మెల్యేల భేటీ

సీఎం జగన్‌తో ముగిసిన  అసంతృప్తి ఎమ్మెల్యేల భేటీ

విజయవాడ: సీఎం జగన్‌తో అసంతృప్తి ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా కొందరు నేతలు మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి రాకపోవడం తమ కార్యకర్తలను బాధించిందని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. బలహీన వర్గాలకు సీఎం ప్రాధాన్యం కల్పించారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సీఎం కోరారని పార్థసారధి తెలిపారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు వల్ల తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని ఆశించానని సామినేని ఉదయభాను అన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో పార్టీని అధికారంలోకి తేవాలని సీఎం కోరారని చెప్పారు. 

Updated Date - 2022-04-12T23:03:59+05:30 IST