ఆ బాధ్యత మంత్రులు తీసుకోవాలి: సీఎం జగన్
ABN , First Publish Date - 2022-07-12T22:52:19+05:30 IST
సీకే కన్వెన్షన్ సెంటర్కు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, సీఎం జగన్ చేరుకున్నారు. ద్రౌపది ముర్మును సీఎం జగన్ సన్మానించారు.
అమరావతి: సీకే కన్వెన్షన్ సెంటర్కు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, సీఎం జగన్ చేరుకున్నారు. ద్రౌపది ముర్మును సీఎం జగన్ సన్మానించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మద్దతు కోరుతున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందామని సూచించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముర్ముకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని జగన్ పేర్కొన్నారు. ఓటు వేసే ముందు కచ్చితంగా మాక్ పోలింగ్లో పాల్గొనాలన్నారు. ఎమ్మెల్యేలు వచ్చి ఓటు వేసేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు.